తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన యువకుడు అరుదైన ఘనత సాధించాడు. మోస్ట్ బైక్స్ టు రన్ ఓవర్ ఏ పర్సన్ విభాగంలో వంద రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లను ఎక్కించుకొని గిన్నిస్ రికార్డు సృష్టించాడు. రాజమండ్రి పుష్కరఘాట్లో జరిగిన కొమ్మ ఉజ్వల్ ప్రదర్శన తిలకించేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చారు. ఉజ్వల్ చిన్నప్పటి నుంచి కరాటే కిక్బాక్సింగ్ తదితరవాటిలో ప్రతిభ కనబరిచాడు.