బస్‌షెల్టర్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన

17 Jul, 2016 18:59 IST|Sakshi
బస్‌షెల్టర్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఇంద్రియాల (భూదాన్‌పోచంపల్లి) : మండలంలోని ఇంద్రియాలలో ఆదివారం రూ.2లక్షల వ్యయంతో నిర్మిస్తున్న కొప్పుల దామోదర్‌రెడ్డి స్మారక బస్‌షెల్టర్‌ నిర్మాణ పనులకు సర్పంచ్‌ బండి కృష్ణగౌడ్‌ ప్రారంభించారు. ఈ షెల్టర్‌ నిర్మాణానికి  కొప్పుల దామోదర్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఆర్థికసాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో కొప్పుల లింగారెడ్డి, ఎంపీటీసీ సంతోష్‌కుమార్, చింతల రామకృష్ణ, జగతి, గరిసె జంగయ్య, శ్రీశైలం, బద్దం రాజేశ్వర్, జంగారెడ్డి, వెంకటేశ్, శంకర్, మధు, గోవర్ధన్‌ పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు