ఇన్నోవా-లారీ ఢీ: ముగ్గురి మృతి

24 Jan, 2016 09:59 IST|Sakshi

చిత్తూరు: బంగారుపాల్యం మండలం మొగిలి ఘాట్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి.

ఇన్నోవా, లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మృతులు కర్ణాటకకు చెందిన నరేష్‌, సురేష్‌, నయిల్‌గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు