పిడుగుపడి 12 మేకలు మృతి

6 Jun, 2016 15:12 IST|Sakshi

పాల్వంచ రూరల్ (ఖమ్మం జిల్లా) : ఖమ్మం జిల్లా పాల్వంచ రూరల్ మండలం యానంబయలు పంచాయతీ రాజాపురం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం పిడుగు పడి 12 మేకలు మృతి చెందాయి. వెంకన్న అనే రైతుకు చెందిన మేకలు పొలంలో మేస్తుండగా పిడుగుపడింది. ఈ సంఘటనలో మందలోని 12 మేకలు మృతిచెందాయి. దాంతో రైతు లబోదిబోమంటున్నాడు.

మరిన్ని వార్తలు