ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ల సమస్యల పరిష్కారానికి కృషి

14 Sep, 2016 20:31 IST|Sakshi
ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ల సమస్యల పరిష్కారానికి కృషి
హుజూర్‌నగర్‌ : తెలంగాణలో ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.శివాజీనాయక్‌ అన్నారు. బుధవారం స్థానిక రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ భవనంలో జరిగిన ఇంజనీర్లు, సబ్‌ఇంజనీర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత విద్యుత్‌ శాఖ అన్ని రంగాల్లో అభివృద్ధి బాట పట్టిందన్నారు. సమావేశంలో విద్యుత్‌ డీఈ వెంకటేశ్వర్లు, అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి రామేశ్వర్‌శెట్టి, ఉపాధ్యక్షులు పున్నానాయక్, రవి, వినోద్, సూర్య, మోతీరాం, అమర్, చిన్నానాయక్‌ పాల్గొన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు