జ్యోతినగర్ : ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఎల్బీ స్టేడియంలో ఆదివారం నిర్వహించే మహాసమ్మేళనాన్ని విజయవంతం చేయాలని బీజేపీ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీ గాండ్ల ధర్మపురి కోరారు. ఎన్టీపీసీ జ్యోతినగర్లోని మయూరి హాల్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రామగుండం నియోజకవర్గంలోని బూత్లెవల్ అధ్యక్ష, కార్యదర్శులు పార్టీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్కు తరలిరావాలన్నారు. సమావేశంలో కోమళ్ల మహేశ్, గుండెబోయిన లక్ష్మణ్యాదవ్, రామన్న, గోపగాని నవీన్, జూల విజయ్కుమార్, గణేశ్, చింతల శంకర్, ఎన్రెడ్డి రాజేశ్, సప్ప నాగరాజు, బాగాల స్వామి, కార్యకర్తలు పాల్గొన్నారు.