శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో ఈ నెల 11 నుంచి ›ప్రారంభమైన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సోమవారం పూర్ణాహుతిని నిర్వహిస్తున్నట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త సోమవారం తెలిపారు. ఉదయం 9.15 గంటలకు ఆలయప్రాంగణంలోని యాగశాల రుద్రహోమ పూర్ణాహుతి, అనంతరం కలశోద్వాసన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేరోజు రాత్రి ధ్వజావరోహణ, ధ్వజపటానిష్క్రమణ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.