నేడు కలెక్టరేట్‌ ఎదుట రైతు సంఘం ధర్నా

29 Jan, 2017 23:52 IST|Sakshi

అనంతపురం అర్బన్‌ : వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు నష్ట పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌తో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ఏపీ రైతు సంఘం (సీపీఐ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సి.మల్లికార్జున, ఎ.కాటమయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ధర్నాని విజయవంతం చేయాలని తెలిపారు.

>
మరిన్ని వార్తలు