సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి సోమ, మంగళవారాల్లో వైఎస్సార్ జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. సోమవారం ఆయన తన తాత వైఎస్ రాజారెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంగళవారం అచ్చవెల్లిలో మినరల్ వాటర్ ప్లాంటును ప్రారంభిస్తారు.