సంగారెడ్డి: మెదక్ జిల్లా పటాన్చెరు ఇస్నాపూర్ వద్ద సోమవారం అర్థరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. వేగంగా వచ్చిన ట్యాంకర్ లారీ ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో బైక్పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులను అరబిందో సంస్థలో పనిచేసే సిద్దారెడ్డి, సురేష్కుమార్గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన పవన్ను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ట్యాంకర్ లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.