బైక్, వ్యాన్ ఢీ: ఇద్దరు మృత్యువాత

18 Jun, 2016 16:07 IST|Sakshi

కోటగిరి (నిజామాబాద్) : బైక్, వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని రాయికూర్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు