ఎడ్లబండిని డీకొన్న లారీ.. ఇద్దరు మృతి

29 May, 2016 08:49 IST|Sakshi

ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం మాంజ్రి గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఎడ్లబండిని లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. మాంజ్రి గ్రామానికి చెందిన తొమ్మిది మంది పాంగ్రి గ్రామ పంచాయతీలోని ఆలయాల్లో భజన కార్యక్రమాలు ముగించుకుని 1 గంట సమయంలో తిరిగి స్వగ్రామానికి వెళుతున్నారు. ఆ క్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఎడ్లబండిని ఢీకొంది. ధర్మాజీ, ఉత్తమ్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. వారిని భైంసా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు.
 

>
మరిన్ని వార్తలు