వీరప్ప.. తపన

4 Sep, 2016 20:32 IST|Sakshi
ప్రతిమలు తయారు చేస్తున్న వీరప్ప

కల్హేర్‌: మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయడమేకాక, పర్యావరణ పరిరక్షణకు అవుసుల వీరప్ప విశేష కృషి చేస్తూ  అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతిమలు తయారు చేస్తూ బిజీగా మారుతారు. చంద్రప్ప- రత్నమ్మ దంపతుల ఎకైక సంతానం వీరప్ప. 

ఓ హోటల్‌లో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తండ్రి చంద్రప్ప వినాయకుడి విగ్రాహాలు తయారు చేసి గ్రామాస్తులకు సరఫరా చేసేవారు. దాదాపు 30 ఏళ్ల క్రితం తండ్రి  మరణించడంతో అప్పటి నుంచి వీరప్ప ఆ బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు.

>
మరిన్ని వార్తలు