ధర్మవరం కుడికాలువకు నీరు విడుదల

11 Nov, 2016 23:24 IST|Sakshi
ధర్మవరం కుడికాలువకు నీరు విడుదల

కూడేరు : మండల పరిధిలోని పీఏబీఆర్‌ డ్యాం నుంచి ధర్మవరం కుడికాలువకు శుక్రవారం నీటిని విడుదల చేశారు. ఈ నెల 1నే నీటిని విడుదల చేయగా... 5 రోజులు క్రితం  ముకుందాపురం, రామచంద్రాపురం, ఆత్మకూరు మండలంలోని యాలేరు ప్రాంతాల వారు తమ ప్రాంతానికి నీటిని తీసుకెళ్ళేందుకు కుడికాలువకు గండ్లు కొట్టారు. గండ్ల మరమ్మత్తుల కోసం 4 రోజులు క్రితం నీటిని అధికారులు నిలిపివేశారు. మరమ్మతులు పూర్తి కావడంతో మళ్ళీ నీటిని విడుదల చేశారు. ఈ నీరు డ్యాం నుంచి ధర్మవరం వరకు 112 కిలో మీటర్ల వరకు ప్రవహిస్తుంది. 

>
మరిన్ని వార్తలు