జయశంకర్ జిల్లా: సింగరేణి గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. కేటీకే-5 ఇంక్లయిన్లో అండర్ మేనేజర్గా పనిచేస్తున్న బండారి వెంకటేశ్(27) అనే యువకుడు ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. రెండో షిఫ్ట్లో విధులు నిర్వర్తిస్తుండగా టబ్బులు(బొగ్గు తొట్టెలు) తలకు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆరు నెలల క్రితమే వెంకటేశ్ ఉద్యోగంలో చేరాడు.
వెంకటేశ్ స్వస్థలం మహబూబాబాద్ జిల్లా కేససముద్రం మండలం ఉప్పరపల్లి. అనూష అనే యువతిని ప్రేమవివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భవతి. వెంకటేశ్ మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ విషయం తెలియగానే సింగరేణి అధికారులు, కార్మికులు పెద్ద ఎత్తున మార్చురీ వద్దకు తరలి వచ్చారు.