ఉరివేసుకుని యువతి ఆత్మహత్య

14 Aug, 2016 21:17 IST|Sakshi
ఉరివేసుకుని యువతి ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా : మండలంలోని అల్లివలస గ్రామానికి చెందిన వాసపల్లి కల్పన (18) అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందింది. స్థానికులు వివరాలు ఇలా ఉన్నాయి. వాసపల్లి ఎర్రయ్య, లక్ష్మీలకు పుట్టిన కల్పన రణస్థలం ఆదిత్య కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకుంది. అయితే ఈమెను పైచదువులు చదివించలేదనే ఉద్దేశ్యంతో మనస్థాపానికి గురై ఉరివేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు.

 శనివారం సాయింత్రం 4 గంటలకు సమయంలో ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఈమె ఉరివేసుకున్నతరువాత అమ్మ లక్ష్మీ భయటనుంచివచ్చి చూసింది. అప్పటికీ  కొనఊపిరితో ఉన్న కల్పనను రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం 4 గంటలకు మ్రుతిచెందింది. మ్రుతదేహానికి గ్రామంలో దహాన సంస్కరణలు చేశారు. జేఆర్‌పురం పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు