కడుపునొప్పితో యువకుడి ఆత్మహత్య

26 Jul, 2016 18:55 IST|Sakshi

షాబాద్: కుడుపునొప్పి భరించలేక ఓ యువకుడు పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చర్లగూడలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నక్కల మహేందర్‌(30) గత మూడు సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. ఇటీవల నొప్పి తీవ్రమవడంతో సోమవారం రాత్రి అతడు గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లక్ష్మి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేపింది. పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు