నేడు 92 స్థానాల్లో పోలింగ్

10 Apr, 2014 00:51 IST|Sakshi
నేడు 92 స్థానాల్లో పోలింగ్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 92 లోక్‌సభ స్థానాలకు గురువారం సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్ జరగనుంది. కేరళలో 20 సీట్లు, యూపీ, హర్యానా, ఒడిశా, మహారాష్ట్రలలో పదేసి స్థానాల చొప్పున, మధ్యప్రదేశ్‌లో 9, ఢిల్లీలో 7, బీహార్‌లో 6, జార్ఖండ్‌లో 5, ఛత్తీస్‌గఢ్, జమ్మూకాశ్మీర్‌లలో ఒక్కో సీటుతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలైన చండీగఢ్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌లలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు