టు కె రన్‌

15 Jan, 2017 23:52 IST|Sakshi
టు కె రన్‌

మొబైల్‌ గేమ్‌

ఇటీవల భారత ప్రభుత్వం నోట్లు రద్దు చేసిన అంశాన్ని ఆధారంగా చేసుకుని ‘మిస్‌ ప్లేస్‌డ్‌ మైండ్స్‌’ సంస్థ ఒక మొబైల్‌ గేమ్‌ రూపొందించింది. ఆండ్రాయిడ్‌లో వచ్చిన ఈ గేమ్‌ పేరు ‘టు కె రన్‌’. కరెంట్‌ టాపిక్‌ని ఆధారంగా మన దేశంలో ఒక గేమ్‌ మార్కెట్‌లోకి రావడం ఇదే ప్రథమం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ క్యారికేచర్‌లతో యానిమేషన్‌ చేసి రూపొందిన ఈ గేమ్‌ను జనవరి మొదటి వారంలో మార్కెట్‌లోకి విడుదల చేశారు.

ఈ గేమ్‌లో... ఎన్నికల గుర్తుతో నోట్లను కొల్లగొడుతున్న అరవింద్‌ కేజ్రీవాల్‌ను అదుపు చేస్తున్న కానిస్టేబుల్‌గా మోడీ లాఠీతో కనిపిస్తారు. ఈ గేమ్‌ ఆడేందుకు తేలిగ్గా ఉంది. చూడటానికి ఆసక్తికరంగా ఉంది. సూర్యప్రకాశ్‌ (విజయవాడ), చంద్రధర్, సాయి తేజ, మోహనవంశీ, శిఖాశర్మ (హైదరాబాద్‌) ఈ గేమ్‌ రూపకర్తలు. గూగుల్‌ ప్లే నుంచి దీనిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు