1 నుంచి సిద్ధేంద్రయోగి నాట్యోత్సవాలు

25 Feb, 2015 01:16 IST|Sakshi

 కూచిపూడి: అఖిల భారత కూచిపూడి నాట్యకళామండలి(కూచిపూడి), కూచిపూడి ఆర్ట్ అకాడమీ(చెన్నై) సంయుక్త నిర్వహణలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ(న్యూఢిల్లీ) సౌజన్యంతో మార్చి ఒకటి నుంచి ఏడో తేదీ వరకు సిద్ధేంద్రయోగి నాట్యోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థల కార్యదర్శులు పసుమర్తి కేశవప్రసాద్, వెంపటి వెంకట్‌లు తెలిపారు.

మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమాలను కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో సిద్ధేంద్రయోగి కళాపీఠంపై నిర్వహిస్తామన్నారు. రోజూ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

 

మరిన్ని వార్తలు