ప్రత్యేకంగా మెరవాలంటే...

24 Feb, 2019 00:27 IST|Sakshi

ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకంగా కనిపించేందుకు ఖరీదైన ఫేస్‌క్రీమ్స్‌ వాడుతుంటారు చాలా మంది. మామూలు రోజుల్లో కూడా ప్రత్యేకంగా కనిపించాలంటే సహజసిద్ధమైన చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. మచ్చలు, మొటిమలు కనిపించకుండా ఉండేందుకు పైపై పూతలు పూసుకునేకంటే... శాశ్వతంగా తొలగిపోయేందుకు ఇలా ప్రయత్నించండి.

కావల్సినవి : క్లీనప్‌ : ఆరెంజ్‌ జ్యూస్‌ – 3 టీ స్పూన్లు, చిక్కటిపాలు – 1 టీ స్పూన్‌

 స్క్రబ్‌ : బియ్యప్పిండి – 2 టీ స్పూన్లు, గడ్డపెరుగు – 1 టీ స్పూన్‌

మాస్క్‌:  ఖర్జూరం – 2(గింజలు తొలగించాలి), తేనె – 1 టేబుల్‌ స్పూన్, నిమ్మరసం – పావు టీ స్పూన్‌.

తయారీ :  ముందుగా ఆరెంజ్‌ జ్యూస్, చిక్కటి పాలు ఒక చిన్న బౌల్‌లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండి, గడ్డపెరుగు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు ఖర్జూరం, తేనె, నిమ్మరసం కలిపి గుజ్జులా చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. తర్వాత ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.. గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

మరిన్ని వార్తలు