వర్షాలపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

18 Nov, 2015 11:19 IST|Sakshi

విజయవాడ: రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఉపద్రవాలను ఎదుర్కొనేందుకు పక్కాగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆయన కలెక్టర్లకు సూచించారు.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే పలువురు మృతిచెందగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.

 

మరిన్ని వార్తలు