ఉద్యోగాల పేరుతో మోసం.. ముగ్గురి అరెస్టు

21 Jul, 2017 18:09 IST|Sakshi

గాజువాక: ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీవెంకటేశ్వర సెక్యూరిటీస్ అండ్ ప్లేస్ మెంట్స్ పేరుతో రైల్వేలో, సచివాలయంలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ కొంత మంది దగ్గర డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. నిందితులు బాధితుల దగ్గర సుమారు రూ.3.3 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. సంస్థ నిర్వాహకులు నంబాల ఆనందకుమార్, మొదలవలస నాగరాజు, ఈశ్వరప్రసాద్ లను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

 

మరిన్ని వార్తలు