500 కిలోల పాలపౌడర్ స్వాధీనం

26 Feb, 2016 14:23 IST|Sakshi

రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లిలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 5 వందల కిలోల పాలపౌడర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని స్కూల్ పిల్లలకు ఇవ్వాల్సిన ఈ పాలపౌడర్‌ను అక్రమంగా తీసుకొచ్చి ఇక్కడ విక్ర యించడానికి తీసుకువచ్చినట్లు తెలిసింది. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

>
మరిన్ని వార్తలు