ఉద్యోగం రాలేదని బలవన్మరణం

20 Aug, 2015 09:53 IST|Sakshi

ఖమ్మం: ఉద్యోగం రాలేదని ఓ బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. మండలంలోని చినమునగాలకు చెందిన విద్యార్థి ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. రెండేళ్లుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఉపాధి అవకాశం దొరకలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన అతను ఈ రోజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు