సుల్తాన్బజార్లో వ్యాపారుల ఆందోళన

27 Oct, 2015 10:51 IST|Sakshi

హైదరాబాద్:  నగరంలోని కోఠి, సుల్తాన్ బజార్ ప్రాంతాలలో వ్యాపారులు ఆందోళన చేపట్టారు. మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదనను నిరసిస్తూ వ్యాపారులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. నేడు సుల్తాన్ బజార్ బంద్ కు వ్యాపారులు పిలుపునిచ్చారు. మెట్రో ప్రాజెక్టు కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని వ్యాపారులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు