ఆప్కో వస్త్రాలపై 50 శాతం తగ్గింపు

7 Oct, 2016 02:32 IST|Sakshi

హైదరాబాద్: దసరా, దీపావళి పండుగల సందర్భంగా అన్ని రకాల చేనేత వస్త్రాలపై 50 శాతం ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నట్లు ఆప్కో చైర్మన్ గుజ్జ శ్రీను తెలిపారు. గురువారం తిలక్‌రోడ్‌లోని జీహెచ్‌ఎంసీ కాంప్లెక్స్‌లో ఆప్కో నూతన శాఖను ఆయన ప్రారంభించారు. ఈ ఆఫర్ ఈ నెల 31 వరకు ఉంటుందన్నారు. ఆప్కో వస్త్రాల కొనుగోలు ద్వారా చేనేతకు చేయూతనిచ్చినట్లుగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ ఆఫీసర్ కె.జగదీశ్వర్‌రావు, డివిజన్ మార్కెటింగ్ ఆఫీసర్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు