'కమల్నాథన్ కమిటీపై సీఎంకి ఫిర్యాదు చేస్తాం'

13 Apr, 2016 13:42 IST|Sakshi
'కమల్నాథన్ కమిటీపై సీఎంకి ఫిర్యాదు చేస్తాం'

హైదరాబాద్ : కమల్నాథన్ కమిటీ తీరు సరిగా లేదని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ ఆరోపించారు. దీనిపై సీఎం చంద్రబాబు, సీఎస్ ఎస్పీ టక్కర్కి ఫిర్యాదు చేస్తామన్నారు. బుధవారం హైదరాబాద్లో మురళీకృష్ణ మాట్లాడుతూ... ఓ వైపు జూన్లో తరలి వెళ్లమంటున్నారు...కానీ ఇప్పటి వరకు తుది కేటాయింపులు పూర్తి కాలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఏపీ ఉద్యోగుల అభ్యంతరాల నేపథ్యంలో కమల్నాథన్ కమిటీ ఈ రోజు సమావేశం అర్థాంతరంగా వాయిదా పడింది.

మరిన్ని వార్తలు