అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Published Wed, Apr 13 2016 1:48 PM

farmer commits suicide due to debts in mahabub nagar

ఆత్మకూర్: మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండలం జూరాల గ్రామానికి చెందిన ఓ రైతు రుణభారంతో బలవన్మరణం చెందాడు. గ్రామానికి చెందిన కురువా ఖాసిం(55) తన పొలంలో ఈ ఏడాది వరి సాగు చేశాడు. వర్షాభావంతో పంట ఎండిపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పు తీరేదారి కనిపించక బుధవారం ఉదయం తన పొలంలోనే చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించాడు. ఇతనికి సుమారు రూ.3.50 లక్షల అప్పు ఉందని స్థానికులు తెలిపారు. ఖాసిం కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement