జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్ సమీక్షలు

2 Oct, 2016 12:26 IST|Sakshi
జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్ సమీక్షలు
హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు ప్రక్రియ తుదిదిశకు చేరింది. దీనిపై సీఎం కేసీఆర్ ఆదివారం జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా టీఆర్ఎస్ నేతలతో సీఎం క్యాంప్ ఆఫీస్లో సమావేశమయ్యారు. 
 
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై సీఎం కేసీఆర్ జిల్లాల నేతలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా నేతలు పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ నల్లగొండ, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. 
 
మరిన్ని వార్తలు