కంటోన్మెంట్లో ఎన్నికల నామినేషన్ సమయంలోనే ప్రత్యక్షమయ్యే నేత ఆయన. 1994 నుంచీ దివంగత సాయన్న పోటీ చేసిన ఆరు ఎన్నికల్లోనూ ఆయనే నామినేషన పత్రాలు నింపారు. ఇప్పుడు సాయన్న కుమార్తె లాస్య నందిత సైతం అదే సెంటిమెంట్ ఫాలో అయ్యారు. ఇంతటి కీలకమైన సెంటిమెంట్ కలిగిన ఆయనే మాజీ టీడీపీ నేత రమేశ్రెడ్డి. కొన్నేళ్లుగా దాదాపుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ సాయన్న కుమార్తె లాస్య నందిత, మళ్లీ ఆయననే పిలిపించుకున్నారు. గురువారం ఎన్నికల నామినేషన్ పత్రాలను రమేశ్ రెడ్డి ద్వారానే పూర్తి చేసి.. తండ్రి చిత్రపటం వద్ద ఉంచి రిటర్నింగ్ కార్యాలయానికి బయలుదేరారు. సాయన్న అనుచరులు పలువురు చాన్నాళ్ల తర్వాత రమేశ్ రెడ్డిని చూసి ఆనందం వ్యక్తం చేశారు. తమ నేతకు సెంటిమెంట్గా మారిన రమేశ్రెడ్డి రాక లాస్య నందిత విజయానికి శుభసూచకం అంటూ మురిసిపోయారు. – కంటోన్మెంట్