'చేతకాదన్న వాళ్లకు సమాధానం చెప్పాలి'

23 Feb, 2016 17:16 IST|Sakshi
'చేతకాదన్న వాళ్లకు సమాధానం చెప్పాలి'

హైదరాబాద్: తెలంగాణ వాళ్లకు పరిపాలన చేతకాదని విమర్శించిన వాళ్లకు సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. మాజీ మంత్రి  బస్వరాజు సారయ్య మంగళవారం టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

కేసీఆర్ మాట్లాడుతూ.. 'ఎన్నో కష్టాలకోర్చి తెలంగాణ సాధించుకున్నాం. వచ్చిన తెలంగాణను గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. బంగారు తెలంగాణ కోసం అంతా ఏకం కావాలని' పిలుపునిచ్చారు. పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించడంతో పాటు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, కల్యాణ లక్ష్మిలాంటి పథకాలు పెట్టి పేదల కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం జరుగుతుందని కేసీఆర్ తెలిపారు.  కరెంటు కొరత లేకుండా చేశామని, కరువు నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు