హైదరాబాద్: వనపర్తి జిల్లా ఎక్సైస్ సూపరింటెండెంట్ నవీన్ నాయక్ పై హెచ్చార్సీ లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ నవీన్ నాయక్ పై చర్యలు తీసుకోవాలంటూ పెద్దగూడెం తండాకు చెందిన వెంకటమ్మ హెచ్చార్సీని ఆశ్రయించింది. సారాయి తయారు చేస్తున్నావంటూ తనని వేధింపులకి గురిచేస్తున్నాడంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.