భవనంపై నుంచి పడి యువతి మృతి

3 Oct, 2016 09:42 IST|Sakshi
భవనంపై నుంచి పడి యువతి మృతి

హైదరాబాద్: కాప్రాలోని పల్లె పారడైజ్ అపార్టుమెంట్ మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందిపడి ఓ యువతి చనిపోయింది. ఆ అంతస్తులోని 46వ నంబర్ ప్లాట్‌లో ఉండే పనసారెడ్డి కూతురు ఐశ్వర్య(18) ఆదివారం రాత్రి బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి సోమవారం ఉదయం ఆమె మృతి చెందింది.

>
మరిన్ని వార్తలు