అయిదు కిలోల బంగారు గాజులు స్వాధీనం

23 Jul, 2014 10:52 IST|Sakshi
అయిదు కిలోల బంగారు గాజులు స్వాధీనం

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి కస్టమ్స్ అధికారులు బుధవారం ఉదయం పెద్ద ఎత్తున బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు మహిళల నుంచి సుమారు అయిదు కిలోల బంగారు గాజులను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 గత కొంతకాలంగా శంషాబాద్ విమానాశ్రయం విదేశాల నుండి బంగారం అక్రమ రవాణా చేసే వ్యాపారులకు అడ్డాగా మారింది.  మునుపెన్నడూ లేని విధంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకుంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు 62 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. దీనివిలువ మార్కెట్ లో రూ.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక ఈ ఏడాది ఆరునెలల్లోనూ భారీగానే బంగారాన్ని పట్టుకున్నారు.


 

మరిన్ని వార్తలు