బంగారం తెచ్చి.. చెత్తబుట్టలో వేసి.. ఎయిర్‌పోర్టు ఉద్యోగి కూడా అరెస్ట్‌

7 Sep, 2023 07:48 IST|Sakshi

సాక్షి, శంషాబాద్‌: కస్టమ్స్‌ తనిఖీలు తప్పించు­కుని బంగారాన్ని బయటికి తరలించేందు­కు స్మగ్లర్లు కొత్తకొత్త మార్గాలను ఆశ్రయి­స్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులే బంగారాన్ని బ­యటికి తీసుకురాకుండా, ఎయిర్‌­పోర్టు ఉద్యోగు­లతో బయ­టికి తరలిస్తున్న సంఘటనలు బయట­పడుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు కస్టమ్స్‌ తనిఖీలకు రాకముందు అరైవల్‌లో ఉన్న మరుగుదొడ్డిలోకి వెళ్లాడు.

అక్కడి ఓ చెత్త డబ్బాలో తాను తీసుకొచ్చిన బంగారాన్ని వేసి యథాతథంగా కస్టమ్స్‌ తనిఖీలకు వెళ్లాడు. తనిఖీల్లో ఏమీ దొరక్కపోయినా అనుమానించిన అధికారులు అతడిని విచారించడంతో తాను తీసుకొచ్చిన బంగారాన్ని చెత్తడబ్బాలో వేసినట్లు చెప్పాడు. దానిని ఎయిర్‌పోర్టు ఉద్యోగి బయటికి తీసుకెళ్లనున్నట్లు చెప్పడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే బంగారాన్ని తరలించేందుకు వెళ్లిన సదరు ఎయిర్‌పోర్టు ఉద్యోగిని కూడా అరెస్ట్‌ చేశారు.

933 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం ఉదయం కూడా ఇదే తరహాలో కువైట్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడు 1,300 గ్రాముల బంగారాన్ని చెత్తడబ్బాలో దాచిపెట్టడంతో కస్టమ్స్‌ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: వర్షం ఉంటే బడులకు సెలవులివ్వండి.. విద్యాశాఖ ఆదేశం 

మరిన్ని వార్తలు