ప్రముఖ నటుడి పర్సు చోరీ

8 Jan, 2015 14:12 IST|Sakshi
ప్రముఖ నటుడి పర్సు చోరీ

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యు.వి. కృష్ణంరాజు పర్సును శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆగంతకులు దొంగిలించారు. పర్సులో పలు క్రెడిట్ కార్డులతోపాటు భారీగా నగదు ఉన్నట్లు ఆయన గురువారం తెలిపారు. గత రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ విచ్చేశారు.

ఆయనకు స్వాగతం పలికేందుకు ఆ పార్టీకి చెందిన నేతలంతా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అమిత్ షాకు స్వాగతం పలికే క్రమంలో కృష్ణంరాజు ప్యాంట్ జేబులోని పర్సును ఆగంతకులు చోరీ చేశారు.

మరిన్ని వార్తలు