రైతు ఆత్మహత్యల నివారణలో విఫలం

22 Aug, 2017 02:00 IST|Sakshi
రైతు ఆత్మహత్యల నివారణలో విఫలం

కేసీఆర్‌పై ఇంద్రసేనారెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్‌:
రైతు ఆత్మహత్యలు నివారించడంలో సీఎం కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. రైతులకు భరోసానిచ్చి, అండగా నిలబడుతున్నామనే విశ్వాసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేకపోయిందని ఆరోపించారు.

రైతు సమస్యలపై కమిషన్‌ వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు చేసి ఏడాది దాటినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ అవార్డు ప్రకటించింది కేంద్రం కాదని.. ఓ ప్రైవేట్‌ విత్తన వ్యాపార సంస్థ అని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు