సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం రాత్రి 11 గంటలకు న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో కుటుంబ సభ్యులతో కలసి జగన్ పయనమయ్యారు. రెండు వారాల అనంతరం జగన్ స్వదేశానికి తిరిగి వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.