ట్రాఫిక్ పోలీసుల దందాపై లారీ డ్రైవర్ల ఆందోళన

12 Mar, 2015 21:33 IST|Sakshi
ట్రాఫిక్ పోలీసుల దందాపై లారీ డ్రైవర్ల ఆందోళన

కుషాయిగూడ (హైదరాబాద్‌సిటీ) : లారీ డ్రైవర్లపై ట్రాఫిక్ పోలీసుల దందాలను నిరసిస్తూ చక్రిపురం ఇసుక లారీల అడ్డా వద్ద బ్రిక్స్ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రోడ్డు పక్కన నిలిపిన లారీలకు సైతం వేల రూపాయలు చలానాలు రాస్తున్నారని ఆరోపించారు. మామూళ్లు ఇవ్వకపోతే కక్ష సాధింపులకు పాల్పడుతూ వేల రూపాయలు జరిమానా విధిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వారు ప్రతి నెల మామూళ్లు చెల్లించగానే ట్రాఫిక్ పోలీసులు జారీ చేస్తున్న కార్డులు, వారు విధిస్తున్న జరిమానా పత్రాలను మీడియాకు చూపారు. కార్యక్రమంలో ప్రతినిధులు నాను నాయక్,బిచ్చానాయక్, ప్రశాంత్,బాలజీ, పాండు, బిక్షపతి, లింగానాయక్, మాన్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు