శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు పెద్ద మొత్తంలో అనుమతి లేని మందులను స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన శ్రీధర్రెడ్డి అనే ప్రయాణికుడికి చెందిన లగేజీని తనిఖీ చేయగా రూ.60 లక్షల విలువైన అనుమతి లేని విదేశాల్లో తయారైన మెడిసిన్స్ దొరికాయి. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీధర్రెడ్డి హైదరాబాద్ వాసి అని సమాచారం.