కంటోన్మెంట్‌లో పారిశుధ్య కార్మికుల ధర్నా

7 Aug, 2015 11:50 IST|Sakshi
కంటోన్మెంట్‌లో పారిశుధ్య కార్మికుల ధర్నా

హైదరాబాద్ : పారిశుధ్య కార్మికునిపై ఓ వ్యక్తి దాడి చేయడాన్ని నిరసిస్తూ... కంటోన్మెంట్లోని కార్మికులు శుక్రవారం ధర్నాకు దిగారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో గురువారం రోడ్డుపై చెత్తవేస్తున్న వ్యక్తిని పారిశుధ్య కార్మికుడు రమేష్ అడ్డుకున్నాడు. దాంతో వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో రమేష్పై సదరు వ్యక్తి దాడి చేశాడు.

దాంతో కలత చెందిన పారిశుధ్య కార్మికుడు ఈ విషయాన్ని తోటి కార్మికులతో చెప్పాడు. దాంతో వారు శుక్రవారం ధర్నాకు దిగారు. బోయినపల్లి పరిథిలోని ఐదు సర్కిళ్లకు చెందిన మొత్తం 750 మంది కార్మికులు విధులను బహిష్కరించి సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

మరిన్ని వార్తలు