సికింద్రాబాద్: సికింద్రాబాద్లోని సంగీత్ థియేటర్ వద్ద శనివారం ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనలో నాలుగు ద్విచక్ర వాహనాలు, ఓ కారు ధ్వసం అయ్యాయి. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.