గ్రేటర్ అభ్యర్థుల ఎంపికకు ప్రత్యేక కమిటీ: కేసీఆర్

6 Jan, 2016 19:36 IST|Sakshi

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్లో రెండు బహిరంగ సభల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రేటర్ అభ్యర్థుల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డివిజన్కు ముగ్గురు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

నామినేషన్లకు ముందే అభ్యర్థుల ప్రకటన చేయనున్నట్టు పేర్కొన్నారు. 150 డివిజన్లలో ప్రతిరోజూ పాదయాత్రలు చేయాలని కేసీఆర్ ఆ పార్టీ నేతలను, అభ్యర్థులను ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు