నల్లకుంట, న్యూస్లైన్: సీఏ చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. న్యూనల్లకుంట నరేంద్ర పార్క్ సమీపంలో నివాసముంటున్న అరుం దతి నాంపల్లిలోని బీఐఎస్ ఉద్యోగిని. సీఏ చదువుతున్న కుమారుడు మణికంఠరెడ్డి(25) గురువారం సాయంత్రం 5 గంటలకు ఆఫీస్కు వెళ్లిన తల్లికి ఫోన్చేసి మోషన్స్ అవుతున్నాయని చెప్పాడు.
తల్లి వెంటనే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసింది. తీరా చూడగా కుమారుడు మణికంఠ ఫ్యాన్ హుక్కు ఉరిపోసుకుని వేలాడుతూ కనిపించాడు. బోరున విలపిస్తుండటంతో ఇరుగు పొరుగు అక్కడికి చేరుకుని చూడగా మణికంఠ అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు శవ పంచనామా నిర్వహించి, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృత దేహాన్ని గాంధీకి తరలించారు. భర్త నాలుగేళ్ల క్రితమే మృతి చెందడం, చేతిక అందివచ్చిన ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లి హృదయవిదారకంగా విలపిస్తోంది. కాగా మణికంఠకు సీఏలో కొన్ని సబ్జెక్టులు బ్యాక్లాగ్ ఉండ టంతో మనస్తాపానికి గురై అత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చే స్తున్నారు.