గాంధీభవన్లో పనికిమాలినవారు చేరారు

10 Oct, 2016 15:08 IST|Sakshi

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా, ప్రజలను సీఎం కలవడంలేదని విమర్శించడం సమంజసమా అని నిలదీశారు.

గాంధీభవన్లో పనికిమాలినవారందరూ చేరారని తలసాని అన్నారు. బుద్ధిలేని కాంగ్రెస్ నేతలు తమపై అవాకులు, చవాకులు పేలుతున్నారని విమర్శించారు. తమను విమర్శించేముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వ్యాఖ్యానించారు.
 

మరిన్ని వార్తలు