రేపు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

15 Jul, 2016 15:59 IST|Sakshi

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం ఉదయం 9.30 గంటలకు లోటస్‌పాండ్‌లో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎంపీలందరూ హాజరవుతారు. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోఈ పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించ వలసిన వ్యూహంపై వీరు చర్చిస్తారు.

 

మరిన్ని వార్తలు