పడవ ప్రమాదం: 25 మంది మృతి

26 Oct, 2016 18:55 IST|Sakshi
పడవ ప్రమాదం: 25 మంది మృతి

రోమ్: మధ్యధరా సముద్రంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. లిబియా తీర ప్రాంతంలో వలసదారులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురికావడంతో సుమారు 25 మంది మృతి చెందారు. ఫ్రెంచ్ సహాయక బృందం 'డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్' ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ప్రమాదంలో 107 మందిని సహాయక బృందాలు రక్షించాయి. రబ్బర్ బోట్లో రసాయనాల మూలంగా కాలిన గాయాలతో కొందరు క్షతగాత్రులు ఉన్నారని,  వీరిని ఇటలీకి తరలించడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బోట్ ఇంధనం లీక్ కావడం మూలంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.

ఉత్తర ఆఫ్రికా నుంచి మధ్యధరా సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించిన సుమారు 3,500 మంది ఈ ఏడాది మృత్యువాత పడ్డారు. కిక్కిరిసిన బోట్లు సముద్రంలో తరుచుగా ప్రమాదానికి గురవుతున్నాయి.
 

మరిన్ని వార్తలు