పారిస్ నగరంలో మళ్లీ కిడ్నాప్ కలకలం

16 Jan, 2015 18:18 IST|Sakshi

ఫ్రాన్సు రాజధాని పారిస్ నగరంలో మళ్లీ కిడ్నాప్ కలకలం రేగింది. అక్కడున్న ఓ పోస్టాఫీసులో ముగ్గురిని తీవ్రవాదులు కిడ్నాప్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే.. తీవ్రవాదులు ఎంతమంది ఉన్నారో, అక్కడ ఏం జరుగుతోందోనన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. పారిస్ శివార్లలోని నాన్టెర్రో ప్రాంతంలో ఉన్న పోస్టాఫీసులో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.

మరోవైపు పాకిస్థాన్లోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం వద్ద జరిగిన కాల్పుల్లో ఏఎఫ్పీ పాత్రికేయ సంస్థకు చెందిన ఓ ఫొటో జర్నలిస్టు మరణించారు.

మరిన్ని వార్తలు