నేపాల్‌లో విషాదం.. 27 మంది మృతి

1 Apr, 2019 11:08 IST|Sakshi

ఖాట్మండూ : నేపాల్‌లో విషాదం చోటుచేసుకుంది. తుఫాను ధాటికి 27 మంది మృతి చెందగా.. 400 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. సహాయక చర్యలు చేపట్టిన రక్షణా సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బారా, పార్సా జిల్లాల్లో ఆదివారం సాయంత్రం నుంచి పెనుగాలులతో కూడిన వర్షాలు కురవడంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు.

ఈ ఘటనపై స్పందించిన నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ క్రమంలో ప్రధాని సలహాదారు బిష్ణు రిమాల్‌ మాట్లాడుతూ.. ‘ ఖాట్మండులోని మిడ్‌ ఎయిర్‌బేస్‌లో ఉన్న రెండు బెటాలియన్లను ఘటనా స్థలికి పంపించాం. వాతావరణం సహకరించకపోవడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మా బలగాలు బాధితులను రక్షిస్తాయి. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తాం’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు